ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ముంబైలో పర్యటించనున్న మంత్రి లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 04:34 PM

ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు ముంబైలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ఏకైక అజెండాగా ఆయన పర్యటన కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా దేశంలోని పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వీరితో పాటు ట్రాఫిగురా సీఈఓ సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ సాదత్ షా, హెచ్‌పీ ఐఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ డిప్యూటీ ఛైర్మన్ వీర్ అద్వానీ వంటి ప్రముఖులతో లోకేశ్‌ చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ విధానాలను ఆయన వారికి వివరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa