ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీకి గుణపాఠం చెబుతామంటూ బలుపు.. లష్కరే తోయిబా ఉగ్రవాది హెచ్చరిక!

international |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 09:09 PM

లష్కరే తోయిబా మరోసారి తన అసలుదృష్టిని బయటపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీని బెదిరిస్తూ, పాకిస్తాన్‌కు చెందిన ఈ ఉగ్రవాద సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో కసూరీ మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్లే పాకిస్తాన్‌లో భారీ వరదలు వచ్చాయని, దానికి భారతదేశమే బాధ్యత వహించాల్సిందిగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి "గుణపాఠం" చెబాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అందుకోసం పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌ను ప్రత్యక్షంగా అభ్యర్థించబోతున్నామని వెల్లడించాడు.పాక్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నప్పుడు తీసిన వీడియోలో, కసూరీ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "మే 10, 2025న మేము ఎలా స్పందించామో, మళ్లీ అదే విధంగా మోదీకి గుణపాఠం నేర్పాలని కోరుతున్నాను" అని అన్నారు. అయితే, ఆయన ఏ దాడిని సూచిస్తున్నారన్నది స్పష్టంగా తెలియదట.ఇంకా, భారత్ ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేస్తూ "జల ఉగ్రవాదం" చేస్తోందని, ఇది పాకిస్తాన్‌పై ఒక విధమైన యుద్ధమేనని ఆరోపించాడు. గతంలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్తాన్‌ను తీవ్రంగా కలవరపెడుతోందని వెల్లడించాడు.1960లో భారత్–పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం, భారతదేశం నదుల జలాలను నియంత్రణలో ఉంచేది. అయితే ఈ ఒప్పందాన్ని భారత్ అమలుచేయడం ఆపేసిందని, అది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa