ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్తతో అక్రమ సంబంధం.. సీక్రెట్ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 07:30 PM

ఉత్తర ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ విస్మయకర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఓ వ్యక్తి పిల్లనిచ్చిన అత్తతోనే అక్రమ సంబంధం నెరిపాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమెతో చాలా కాలంగా వ్యవహారం సాగించాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియడంతో.. ఆమె గొడవ చేసింది. దీంతో అత్తతో బంధానికి భార్య అడ్డొస్తుందని ఆమెను హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకుందని నాటకమాడాడు. కానీ అసలు విషయాన్ని పోలీసులు పసిగడుతున్నారని తెలుసుకుని పారిపోయాడు. ఆ తర్వాతే అతడు అత్తతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. దీంతో అసలు బాగోతం బయట పడింది.


ఈ దారుణ ఘటన యూపీలోని కాస్‌గంజ్ జిల్లా సిధ్‌పురా ప్రాంతంలో జరిగింది. ముఖ్యంగా ఇదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల శివానికి 2018లో ప్రమోద్‌తో వివాహం జరిగింది. అయితే కొన్నేళ్ల పాటు వీరిద్దరి మధ్య కాపురం బాగానే సాగింది. కానీ గత కొంతకాలంగా ప్రమోద్.. తన అత్తగారు అంటే శివానీ తల్లితోనే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్యకు చెప్పకుండా అత్తగారింటికి వెళ్తూ ఆమెతో శారీరక సుఖం పొందుతున్నాడు. అంతేకాకుండా ఆమెతో సన్నిహితంగా ఫొటోలు దిగుతూ.. వాటిని అప్పుడప్పుడూ చూసుకుని మురిసిపోతున్నాడు. చాలా రోజుల పాటు ఈ వ్యవహారం బయటపడలేదు.


కానీ తరచుగూ ప్రమోద్ అత్తగారింటికి వెళ్లడం, అతడు వెళ్లగానే ఇంటి తలుపులు మూయడంతో అందరికీ అనుమానం వచ్చింది. వారి తీరు కూడా అనుమానాస్పదంగా అనిపించడంతో.. ఇదే విషయమై వారిని నిలదీశారు. ఓవైపు శివానీ తండ్రి భార్యను అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తుంటే.. మరోవైపు శివానీ తన భర్త ప్రమోద్‌ను మార్చుకోవాలని చూసింది. తరచుగా నీవు చేసేది తప్పని.. తీరు మార్చుకోమంటూ బుద్ధి చెప్పింది. కానీ అత్తతో బంధాన్ని తెంచుకోలేకపోయిన ప్రమోద్.. తమ బంధానికి అడ్డుగా ఉన్న భార్యనే చంపాలనుకున్నాడు. అందుకోసం ఓ పథకం వేసి మరీ ఆమెను చంపేశాడు. ఆపై ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా భార్య కనిపించకుండా పోయిందంటూ నాటకం ఆడాడు.


ముఖ్యంగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే పోలీసులకు మృతదేహం దొరికింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందేమోనని భావించారు. కానీ పోస్టుమార్టం చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను ఎవరో కొట్టి చంపారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ప్రమోద్‌పైనే పోలీసులకు అనుమానం ఉండగా.. అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. కానీ అప్పటికే అతడు పారిపోయాడు. మరోవైపు ప్రమోద్, శివానీ తల్లికి సంబంధించిన సన్నిహిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి కాస్తా పోలీసుల కంట పడగా.. అత్త కోసమే ప్రమోద్ భార్యను చంపాడని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రమోద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేసి వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో సోదాలు చేస్తూ.. శివానీకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa