ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో నేడు దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత జట్టు

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 05:16 PM

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు, నేడు అసలైన సవాల్‌కు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచుల్లో శ్రీలంక, పాకిస్థాన్‌పై గెలిచినప్పటికీ, ఇప్పుడు బలమైన దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు దిగుతోంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఈ ఆసక్తికర సమరానికి వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయం సాధించి, సెమీ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత రెండు మ్యాచుల్లో భారత్ గెలిచినా, బ్యాటింగ్ విభాగంలో కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వంటి కీలక క్రీడాకారిణులు ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. అయితే, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి మిగతా బ్యాటర్లు నిలకడగా పరుగులు సాధించడం జట్టుకు ఊరటనిస్తోంది. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే స్టార్ బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం అత్యంత కీలకం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa