వచ్చే ఐదేళ్లలో ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) ద్వారా లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్ శాఖల మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ అధికారులు తగిన రూట్మ్యా్పను రూపొందించి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. గురువారం స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నర్సింగ్, వెల్డర్లు, ట్రక్కర్లు, బిల్డింగ్ వర్కర్లకు యూర్పతోపాటు జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యనభ్యసించిన యువతీ యువకులకు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఓంక్యాప్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. జర్మనీ, ఇతర విదేశీ భాషల్లో శిక్షణ కోసం డీఈఎ్ఫఏ, డీఈఎల్సీ (యూరోపియన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్), జర్మన్ లాంగ్వేజెస్ ఎసె్సమెంట్ సెంటర్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. నైపుణ్యం పోర్టల్పై లోకేశ్ సమీక్షించారు. ఇందులో 23 విభాగాల డాటాబేస్ను ఏకీకతృతం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 4,639 భారీ, మధ్యతరహా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వర్క్ఫోర్స్ను సిద్ధం చేయాలన్నారు. వచ్చే నెలలో పోర్టల్ను ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ అనుబంధ సంస్థ నామ్టక్ (న్యూ ఏజ్ మేకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa