రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడుకు 15 ఏళ్ల సీఎం పదవీ ప్రస్థానం పూర్తైన సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం నాడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 15 ఏళ్ల పాలనలో అభివృద్ధి, పరిపాలన, ప్రజా సేవకు కొత్త ప్రమాణాలు సృష్టించారన్నారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపకర్త, దూరదృష్టి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. సాంకేతికత, పారదర్శకత, పరిపాలనలో ప్రగతిశీలతో కూడిన నాయకత్వం చంద్రబాబుది అని చెప్పుకొచ్చారు.రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ సృష్టి, పెట్టుబడులు ప్రతి రంగంలో సుస్థిర మార్గదర్శకుడిగా ఆయన నిలిచారని వెల్లడించారు. రైతు నుంచి ఐటీ ప్రొఫెషనల్ వరకు అందరికీ చేరువైన నాయకుడు చంద్రబాబు అని.. గ్రామీణ అభివృద్ధి, నగరీకరణ, మహిళా సాధికారతలో నూతన దిశ చూపిన నాయకుడంటూ కొనియాడారు. తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజనరీ లీడర్ చంద్రబాబు అని పేర్కొన్నారు. కష్టాలు, ప్రతికూలతల మధ్య ప్రజల కోసమే అహర్నిశలు శ్రమించిన అభివృద్ధి శిల్పి అని చెప్పుకొచ్చారు. ప్రతి అడుగు ప్రగతి దిశ వైపు వేసే ఆయన వెంట ప్రయాణించడం, ఆయన మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం అదృష్టమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa