అఫ్గనిస్థాన్తో పూర్తి దౌత్య సంబంధాలను భారత్ పునరుద్ధరించింది. కాబూల్లో ఉన్న తన ‘టెక్నికల్ మిషన్’ను ‘పూర్తిస్థాయి రాయబార కార్యాలయం’గా అప్గ్రేడ్ చేయనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం ఉదయం వెల్లడించారు న్యూఢిల్లీలో తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఆగస్టు 2021లో అప్పటి అష్రఫ్ ఘనీ నాయకత్వంలోని అప్పటి అఫ్గన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో కాబూల్లోని రాయబార కార్యాలయ కార్యకలాపాల స్థాయిని తగ్గించి, అక్కడ పలు చిన్న నగరాల్లో ఉన్న భారత కాన్సులేట్లను కేంద్రం మూసివేసింది. అలాగే, భారత దౌత్య సిబ్బందిని ఆర్మీకి చెందిన సీ-17 విమానాల్లో 20221 ఆగస్టు 15, 16 తేదీల్లో హుటాహుటిన స్వదేశానికి తీసుకొచ్చింది. కాగా, ఈ ఏడాది జనవరిలో దుబాయ్లో భారత్, తాలిబన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.
అఫ్గన్లు తాలిబన్లు తిరిగి హస్తగతం చేసుకున్న 10 నెలల తర్వాత కాబూల్లో దౌత్య కార్యకలాపాలను భారత్ పునరుద్దరించింది. అప్పటి నుంచి కేవలం టెక్నికల్ బృందంతో రాయబార కార్యాలయం నడిపిస్తోంది. తాలిబాన్ ప్రభుత్వం ఆ సమయంలో భారత అధికారులు కాబూల్కు వస్తే వారికి తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఇటీవల కొన్నాళ్లుగా అఫ్గన్లోని తాలిబన్ ప్రభుత్వం, న్యూఢిల్లీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇదే అంశాన్ని అఫ్గన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ తన ప్రకటనలో హైలైట్ చేశారు. భారత్పై ఉగ్రదాడులకు తమ భూభాగాన్ని ఉపయోగించుకోడానికి తాలిబన్లు ఏమాత్రం అనుమతించబోరని ఆయన ఉద్ఘాటించారు. ముత్తఖీ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఎందుకంటే అఫ్గన్ మద్దతున్న ఉగ్రవాదులు తమ భూభాగంపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తూ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనిక చర్యలకు పాల్పడుతోంది. ఈ ఏడాది జనవరిలో పాాక్ జరిపిన దాడిలో చిన్నారులు, మహిళలు సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ మద్దతులో భారత్పై దాడిచేసే ఉగ్రవాద సమూహాలు, ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని సహించదని ముత్తఖీ స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నేపథ్యంలో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడం కూడా గొప్ప పరిణామం.
జైశంకర్తో భేటీ అనంతరం కూడా భారత్పై ప్రశంసలు కురిపించారు. ఆగస్టు 31న సంభవించిన భూకంపం తర్వాత భారత్ తమకు అందజేసిన తక్షణ సాయం అందించిన విధానాన్ని ముత్తఖీ గుర్తుచేసుకున్నారు. ఈ భూకంపంలో 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు. ఈ భూకంపంలో 5 వేలకుపైగా నివాసాలు ధ్వంసమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa