ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు యువకుల అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 03:01 PM

పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ క్యాంపస్ వెలుపల దారుణం చోటు చేసుకుంది. అక్కడే ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడగా.. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు యువకులను.. పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా అరెస్టు చేసిన నిందితుల వివరాలను పోలీసులు తక్షణమే వెల్లడించలేదు.


ఒడిశా రాష్ట్రంలోని జలేశ్వర్‌ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి దుర్గాపూర్‌లోని ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రోజు రాత్రి 8 గంటల సమయంలో ఆమె తన క్లాస్‌మేట్ అయిన ఒక స్నేహితుడితో కలిసి క్యాంపస్ నుంచి బయటికి వెళ్లింది. వారు క్యాంపస్ గేటుకు సమీపంలో ఉండగానే.. ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డుకున్నారు. నిందితులు ఆ యువకుడిని బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. ఆపై మెడికల్ విద్యార్థినిని బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. క్యాంపస్‌కు కీలో మీటరు దూరంలో ఆమెను కిందపడేసి.. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.


ఒకరి తర్వాత ఒకరుగా ఆమెను బొమ్మను చేసి ఆడుకున్నారు. తమ కామవాంఛ తీర్చుకుని.. ఆపై ఆమెను అక్కడి వదిలేసి పారిపోయారు. అలాగే యువతి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఆమె వద్ద ఉన్న రూ. 5 వేల నగదును కూడా వారు దొంగిలించారు. ఈ ముగ్గురు వ్యక్తులు చేసిన దారుణానికి బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కాగా.. ఆమె కనీసం లేచి కూర్చోలేకపోయింది. శారీరక గాయాలు కూడా ఎక్కువ కావడంతో.. ఆమె మూలుగుతూ, ఏడుస్తూ.. చీకట్లోనే నరకం చూసింది. అయితే అటుగా వెళ్తున్న స్థానికులు ఆమెను గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. మెరుగైన చికిత్స అందిస్తున్నారు.


ఘటన గురించి తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే ఒడిశా నుండి దుర్గాపూర్‌కు చేరుకున్నారు. కుమార్తె పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వెంటనే వెళ్లి ఈ దారుణంపై పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా అత్యాచార సంఘటనలో తమ కుమార్తెతో పాటు వెళ్లిన స్నేహితుడి పాత్ర కూడా ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బాధితురాలి స్నేహితుడు కావాలనే ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఉంటాడని లేదా అతనికి నిందితులతో సంబంధం ఉండి ఉంటుందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీ అధికారులు, హాస్టల్ సిబ్బందితో పాటు బాధితురాలిని అనుసరించిన స్నేహితుడిని కూడా విచారించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. సాంకేతిక ఆధారాల సహాయంతో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేయగలిగారు. మరికొంతమంది నిందితులు ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ప్రతిపక్షాలు మమతా బెనర్జీ సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa