విశాఖపట్నంలో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించనుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.87,520 కోట్లు పెట్టుబడి ప్రతిపాదించగా, దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం టైలర్మెడ్ విధానంలో రూ.22,002 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రైడెన్ సంస్థ 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ ఆధారిత డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వేలాది ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయని, విశాఖపట్నం టెక్నాలజీ హబ్గా ఎదగడానికి ఇది తోడ్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.ప్రాజెక్టు కోసం మొత్తం 480 ఎకరాలను రాయితీ ధరపై కేటాయించనున్నారు.
రాంబిల్లి: 160 ఎకరాలు
అడవివరం: 120 ఎకరాలు
ముడసర్లోవ: 200 ఎకరాలు
అదనంగా, ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ కోసం 15 ఎకరాలు కేటాయించనున్నారు. భూముల విలువలో 25 శాతం రాయితీ కూడా మంజూరు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa