భారత్తో జరుగుతున్న రెండో టెస్టు లో పర్యాటక వెస్టిండీస్ బ్యాటర్లు పోరాడుతున్నారు. ఈ సిరీస్లో ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆ జట్టు బ్యాటర్లు.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో మాత్రం ధీటుగా బదులిస్తున్నారు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు విండీస్ ఆలౌట్ అయింది. అనంతరం ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 173 పరుగులతో నిలిచింది. ఆ జట్టు ఇంకా 97 పరుగులు వెనుకంజలో ఉంది.
ఓవర్నైట్ స్కోరు 140/4తో మూడో రోజు ఆట ప్రారంభించింది వెస్టిండీస్. అయితే కాసేపటికే ఆ జట్టు మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. 175/8lతో నిలిచింది. దీంతో 200 రన్స్ లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ చివర్లో ఖరీ పెర్రీ (23), అండర్సన్ ఫిలిప్ (24) పోరాడటంతో 248 పరుగులు చేసింది. 81.5 ఓవర్లలో ఆ జట్టు ఆలౌట్ అయింది. ఇక ఫాలో ఆన్ తప్పించుకునేందుకు అవసరమైన పరుగులు చేయకపోవడంతో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్.. వారిని మరోసారి బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో విండీస్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించింది.
కానీ సిరాజ్, సుందర్ ఆరంభంలోనే విండీస్ను దెబ్బకొట్టారు. 15 ఓవర్ల లోపే రెండు వికెట్లు తీశారు. ఇంకా 30కి పైగా ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో ఈరోజే మ్యాచ్ ముగించేలా కనిపించారు మన బౌలర్లు. కానీ జాన్ ఛాంబెల్ (87), షై హోప్ (66) మొండిగా బ్యాటింగ్ చేశారు. వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంగా క్రీజులో పాతుకుపోయారు. ఆ తర్వాత ఎదురుదాడికి దిగారు. ఇక చివరి గంట ఆటలో వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. అనుకున్నట్లుగానే మరో వికెట్ కోల్పోకుండానే విండీస్ మూడో రోజు ఆటను ముగించింది.
ప్రస్తుతం వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులతో ఉంది. ఆ జట్టు ఇంకా 97 పరుగులు వెనుకంజలో ఉంది. సోమవారం భారత బౌలర్లు విజృంభిస్తే.. రేపే మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్.. 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa