పొట్టకూటి కోసం వేటకు వెళ్లిన మత్స్యకారులకు పంట పండింది. మత్స్యకారుల వలలో అరుదైన రకం చేపలు పడటంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. తెలియా బోళా అనే అరుదైన జాతికి చెందిన చేపలు వారికి దొరకడంతో.. వాటిని వేలం వేశారు. ఈ వేలంలో 90 చేపలకు రూ.కోటి పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక్కో చేప 30 నుంచి 35 కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు వెల్లడించారు. ఈ తెలియా భోళా రకం చేపలను ఔషధాల తయారీలో వాడతారని అందుకే అంత ధర పలుకుతాయని మత్స్యకారులు స్పష్టం చేశారు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఈ
పశ్చిమ బెంగాల్–ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దీఘా సమీపంలో.. బంగాళాఖాతం సముద్ర ముఖద్వారం వద్ద శనివారం రోజున రాత్రి వేటకు వెళ్లిన కొంతమంది మత్స్యకారులకు ఈ అరుదైన రకం తెలియా భోళా చేపలు దొరికాయి. వీటిని ఆదివారం వేలం వేశారు. ఓ కంపెనీ ప్రతినిధులు రూ.కోటికి దక్కించుకున్నారు. ఒక్కో చేప బరువు 30-35 కిలోలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వీటిని ఔషధాల తయారీలో వాడుతున్న నేపథ్యంలో ఇంత ధర పలికిందని వివరించారు.
ఇక దొరికిన 90 చేపల్లో ప్రతీ ఒక్కటి.. 30 కిలోల నుంచి 35 కిలోల మధ్య ఉందని మత్స్యకారులు వెల్లడించారు. ఈ మొత్తం చేపలను దీఘా చేపల మార్కెట్లో వేలం వేశారు. దీంతో ఆ చేపలు వేలంలో రూ.1 కోటి పలికాయి. ఈ 90 తెలియా భోళా చేపలను కోల్కతాకు చెందిన ఒక ఔషధాల కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తెలియా భోళా చేపలకు మార్కెట్లో అత్యధిక ధర పలకడానికి కారణం వాటిలో ఉండే అధిక ఔషధ విలువ, వాణిజ్య విలువేనని పేర్కొంటున్నారు. ఈ తెలియా భోళా చేపల నుంచి తీసిన నూనె, ఇతర శరీర భాగాలను.. ప్రాణాలను రక్షించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని తెలిపారు. ఈ తెలియా భోళా జాతి చేపలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
ఈ అరుదైన చేపల వేటను చూసేందుకు స్థానికులు, పర్యాటకులు దీఘా చేపల మార్కెట్కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాధారణంగా లోతైన సముద్ర జలాల్లో తెలియా భోళా చేపలు కనిపిస్తాయి. ఇవి సముద్ర తీరానికి సమీపంలో దొరకడం చాలా అరుదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ చేప విలువ దాని లింగం, పరిమాణం, బరువు ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొన్నాయి.
ఇక గత సంవత్సరం కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 2 క్వింటాళ్ల బరువున్న 9 అరుదైన తెలియా భోళా చేపలు దొరికినట్లు స్థానికులు వెల్లడించారు. వాటిని సుమారు రూ.15 లక్షలకు విక్రయించారు. తాజాగా మరిన్ని భారీ తెలియా భోళా చేపలు చిక్కగా.. అవి భారీ ధరకు అమ్ముడుపోవడంతో.. మత్స్యకారులు, చేపల వ్యాపారుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీఘా తీరంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే అరుదైన సంఘటనగా చాలా మంది చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa