ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుపై గొడవ జరుగుతోందని బైక్ ఆపాడు.. 11 కిలోల వెండి మాయమైంది

Crime |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 07:31 PM

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే జరిగిన ఓ విచిత్రమైన దొంగతనం ఉదంతం కలకలం రేపుతోంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలోని ఓ రోడ్డుపై.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. అప్పటి వరకు అందులో ఒకరు బండి మీదే ఉండగా.. ఎదుటి వ్యక్తి మీద మీదకు రాగా బండి దిగాడు. అతడితో తగువులాడాడు. ఈక్రమంలోనే ఎవరో సదరు వ్యక్తి బండిలో ఉన్న 11 కిలోల వెండిని ఎత్తుకెళ్లిపోయారు. ఆ విషయ ఏమాత్ర గ్రహించలేకపోయిన బాధితుడు నేరుగా ఇంటికెళ్లాడు. అక్కడకెళ్లాకే తన వెండి పోయిందని చూస్కొని నేరుగా పోలీసులను ఆశ్రయించాడు.


అసలేం జరిగిందంటే?


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆదివారం జేపీసీ ఆసుపత్రి సమీపంలో జరిగింది. షహదరా నివాసి అయిన 22 ఏళ్ల రామరతన్ అగర్వాల్ తన స్కూటర్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో అతని స్కూటర్.. ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. స్వల్పంగానే వాహనాలు ఢీకొన్నప్పటికీ ఎదురుగా వచ్చిన బండి మీద ఇద్దరు వ్యక్తులు ఉండగా.. వారు గొడవకు దిగారు. ఈక్రమంలోనే రామరతన్‌కు, ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అప్పటి వరకు అతడు బండి మీదే ఉండి గొడవ పడుతుండగా.. ఎదుటి వాళ్లు ఆవేశంగా ముందుకు వచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన రామరతన్ కొడతారా రండి రండి అంటూ బైకు పక్కన పడేసి ముందుకెళ్లాడు.


కానీ అప్పటికే రోడ్డుపై చాలా మంది జనం గుమిగూడి.. వారి గొడవను ఆపేశారు. ఇలా రెండు వైపులా వాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఇంటికి వచ్చిన వెంటనే తన బైకులో ఉండాల్సిన ఓ బ్యాగును తెరిచాడు. కానీ అందులో తాను తీసుకు వచ్చిన 11 కిలోల వెండి కనిపించకపోవడంతో రామరతన్ షాక్ అయ్యాడు. ఎక్కడో దొంగతనం జరిగిందని భావించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన వెండి పోయిందని చెప్పాడు. అయితే ఎక్కడైనా బండి ఆపారా, ఎక్కడ పోయి ఉంటుందంటూ పోలీసులు అడగ్గా.. జరిగిన గొడవ గురించి వివరించాడు. ఇదంతా విన్న పోలీసులకు కావాలనే నిందితులు రామరతన్ బండిని ఢీకొట్టి గొడవకు దిగి ఉంటారని.. అదును చూసి వెండి కొట్టేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఈ కోణంలోనే కేసును దర్యాప్తు చేస్తూ.. గొడవ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే 11 కిలోల వెండి విలువ కోటి రూపాయలకు పైగా ఉండగా.. రామరతన్ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఎలాగైనా సరే తన వెండి తనకు విప్పించాలని కోరుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa