ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, చాలా కాలంగా వస్తున్న పెన్షన్ పెంపు డిమాండ్పై సంస్థ చివరికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగులు ఈ నిర్ణయంపై EPFO అధికారిక ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.పెన్షన్ పెంపు అంశంపై చర్చించేందుకు EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం అక్టోబర్ 10 మరియు 11 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనపై చర్చ జరగగా, ఈసారి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస పెన్షన్ మొత్తం 2014లో నిర్ణయించిన రూ. 1,000 మాత్రమే. ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయం, మార్కెట్ మార్పులను దృష్టిలో ఉంచుకుంటే ఈ మొత్తం సరిపోవడం లేదని ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. అందుకే వారు పెన్షన్ మొత్తాన్ని రూ. 7,500కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే CBT పూర్తిగా ఆ స్థాయికి పెంచడానికి మొగ్గు చూపకపోయినా, రూ. 1,000 నుండి రూ. 2,500 వరకు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పెంపు అమలులోకి వస్తే ఉద్యోగులకు కొంతవరకు ఉపశమనాన్ని అందించగలదని భావిస్తున్నారు.EPFO యొక్క ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) కింద పెన్షన్ను లెక్కించడానికి ఒక ప్రత్యేక సూత్రం ఉంటుంది:(పెన్షనబుల్ జీతం × పెన్షనబుల్ సర్వీస్) ÷ 70 ఇందులో పెన్షనబుల్ జీతం అంటే ఉద్యోగి చివరి 60 నెలల సగటు జీతం, పెన్షనబుల్ సర్వీస్ అంటే EPSకి చెల్లించిన మొత్తం సేవా కాలం (సంవత్సరాలు). ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే కనీసం 10 సంవత్సరాల సేవ అవసరం. అలాగే పెన్షన్ లెక్కించడానికి గరిష్ట జీత పరిమితి నెలకు రూ. 15,000గా నిర్ణయించబడింది.ఉద్యోగుల పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులకు గణనీయమైన లాభం చేకూరనుంది.వలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa