ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాల అభివృద్ధి దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 05:05 PM

ఆంధ్రప్రదేశ్ గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమానికి పటిష్ఠమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, రెండో దశ కార్యక్రమాలు అంతకుమించి విజయవంతమయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పల్లె పండగ మొదటి దశ స్ఫూర్తిని కొనసాగిస్తూ, రెండో దశ ప్రణాళికలు రాష్ట్రంలోని పల్లెసీమల రూపురేఖలను సమూలంగా మార్చే విధంగా ఉండాలి" అని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa