గుంటూరు జిల్లా, తురకపాలెంలో జరుగుతున్న మరణాలు, పెద్ద ఎత్తున అస్వస్తతకు గురవుతున్న ప్రజల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని వైయస్ఆర్సీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జీ బాలసాని కిరణ్ వాపోయారు. తురకపాలెంలో జరుగుతున్న మరణాలకు రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో బతుకుతున్నారు. ఇక్కడి ప్రజలు ఏ కారణాల వల్ల అస్వస్తతకు గురవుతున్నారనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం జరిపిన వివిధ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లను ఎందుకు బయటపెట్టడం లేదు? నిన్న కూడా ఢిల్లీ నుంచి ఒక ఆర్గనైజేషన్ వచ్చి నమూనాలను సేకరించింది. అంటే ఇప్పటికీ గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైన పరిస్థితి కొనసాగుతున్నా, దీనిని పరిష్కరించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఒకవైపు ప్రజలు అంతుచిక్కని కారణాలతో మరణిస్తుంటే, మేం పరిహారం ఇచ్చేశామని చేతులు దులుపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపై తురకపాలెంకు చెందిన పలువురు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వం తమ పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని వివరించారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa