గుంటూరు జిల్లా, తురకాపాలెంలో అంతుచిక్కని కారణాలతో మరణించిన కుటుంబాలకు సంబంధించి కొందరికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించింది అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు. నేడు తురకపాలెంలో పర్యటించిన అయన మాట్లాడుతూ... మాకు కలుషితమైన నీరు సరఫరా చేస్తున్నారంటూ తురకపాలెంకు చెందిన ప్రజలు జిల్లా కలెక్టర్కు ఆరు నెలల కిందట మొరపెట్టుకున్న, ప్రజా ప్రతినిధులకు చెప్పుకున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. క్వారీ గుంటలో కలుషితమైన నీటినే సరఫరా చేయడం వల్ల వివిధ అనారోగ్య లక్షణాలతో పెద్ద ఎత్తున మరణాలు జరిగాయి. సురక్షితమైన నీటిని ముందే సరఫరా చేసి ఉంటే, ఈ మరణాలు జరిగేవా? నష్టం జరిగిన తరువాత ఆ క్వారీ నుంచి నీటిని ఇవ్వడం ఆపివేసి, బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. కలుషిత నీటి వల్ల జరిగిన, జరుగుతున్న మరణాలు ప్రభుత్వ హత్యలు కావా? అంతుచిక్కని కారణాలతో చనిపోతున్న పరిస్థితులపై ఎందుకు విచారణ జరపలేకపోయారు? తురకపాలెంలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు. వారి ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? ఆరు నెలలుగా జరుగుతున్న ఈ ప్రమాదకర పరిస్థితులను పరిష్కరించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? మరోసారి దీనిపై వైయస్ఆర్సీపీ ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దమవుతోంది. గ్రామంలో పర్యటించి తాజా పరిస్థితులను తెలుసుకుంటాం. అలాగే మాజీ సీఎం, పార్టీ అధినేత వైయస్ జగన్ గారికి కూడా దీనిపై వివరాలను అందచేస్తాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి, గ్రామంలోని ప్రజలకు రక్షణ కల్పించే వరకు పోరాడతాం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa