ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూగుల్‌ పెట్టుబడి వల్ల లక్ష మందికిపైగా ఉపాధి దొరుకుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 01:13 PM

గతంలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్‌ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. కేవలం డేటా సెంటర్‌ మాత్రమే కాదని.. ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని అన్నారు. గూగుల్‌ పెట్టుబడి వల్ల లక్ష మందికిపైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ 2024లో గూగుల్‌ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యానని.. గూగుల్‌ ప్రతినిధులకు డేటా సెంటర్‌ స్థలాన్ని చూపించామని వెల్లడించారు. ఇది జరిగిన నెలరోజుల్లో యూఎస్‌కు వెళ్లి గూగుల్‌ క్లౌడ్‌ నాయకత్వాన్ని కలిసినట్లు తెలిపారు. 2024 నవంబర్‌లో గూగుల్‌ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారని.. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు అనేకసార్లు భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైందన్నారు. భారీ పెట్టుబడులపై అన్నిచోట్ల చర్చలు జరుగుతున్నాయన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa