ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నింగిలోకి 3 శాటిలైట్లులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 10:16 AM

 ఉపగ్రహాల తయారీ, వాటిని నింగిలోకి ప్రయోగించడమంటే ఠక్కున గుర్తుకొచ్చేది శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం మాత్రమే. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ విద్యార్థులు సొంత పరిజ్ఞానంతో ఉపగ్రహాలు తయారు చేసి, ప్రయోగించే స్థాయికి సాంకేతికత విస్తరించింది. ఇందుకు నిదర్శనమే కేఎల్‌ యూనివర్సిటీలో శనివారం చేపడుతోన్న 3 శాటిలైట్ల లాంచింగ్‌. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ వర్సిటీలో శనివారం ఉదయం 5.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. వర్సిటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు.. సీహెచ్‌ కావ్య, కె.శరత్‌కుమార్‌ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. లాంచ్‌ప్యాడ్‌గా గ్రీన్‌ఫీల్డ్‌ క్యాంపస్‌లోని క్రికెట్‌ మైదానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, కేఎల్‌ఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ ఛాన్సలర్‌ కోనేరు సత్యనారాయణ హాజరవుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa