ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి రిషభ్ పంత్

sports |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 02:36 PM

గాయం కారణంగా మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్‌కు ఇండియా-ఏ జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతడిని నియమించింది. ఈ నిర్ణయంతో పంత్ రీఎంట్రీపై ఉన్న ఊహాగానాలకు తెరపడింది.ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా పంత్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా అతను ఆసియా కప్, వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్, ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో  కోలుకుంటున్న పంత్, ఇటీవలే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు.అతని పునరాగమనాన్ని దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఈ రెండు మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఈ నెల‌ 30 నుంచి నవంబర్ 9 వరకు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా పంత్ తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa