ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 జట్టులోకి మళ్ళీ రానున్న బాబర్ ఆజం

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 02:36 PM

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం దాదాపు ఏడాది విరామం తర్వాత మళ్లీ జాతీయ టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు, శ్రీలంక, జింబాబ్వేలతో జరిగే త్రైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గురువారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. పేలవమైన స్ట్రైక్ రేట్ కారణంగా 2024 డిసెంబర్‌లో జట్టుకు దూరమైన బాబర్‌కు సెలక్టర్లు మళ్లీ అవకాశం కల్పించారు.ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో పాకిస్థాన్ రన్నరప్‌గా నిలిచినప్పటికీ, చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి చవిచూసింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. అతనితో పాటు ఓపెనర్ ఫఖర్ జమాన్, మహమ్మద్ హరీస్, ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌవూఫ్‌లను కూడా పక్కనపెట్టారు.ఈ సిరీస్‌కు జట్టుకు ఆల్‌రౌండర్ సల్మాన్ అఘా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పేసర్ నసీమ్ షా, బ్యాటర్ అబ్దుల్ సమద్, వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్‌లకు తొలిసారిగా జట్టులో చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ అక్టోబర్ 28న రావల్పిండిలో ప్రారంభం కానుంది.టీ20 సిరీస్ అనంతరం పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 4 నుంచి 8 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరగనుంది. ఈ వన్డే సిరీస్‌కు షాహీన్ షా అఫ్రిది కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్‌లు వన్డే జట్టులో కొనసాగుతుండటం గమనార్హం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa