ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల వైద్య హక్కుపై దాడి చెయ్యాలని ప్రభుత్వం చూస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 12:47 PM

ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే కూట‌మి ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను కోటి సంత‌కాలతో తిప్పికొట్టాల‌ని వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నమండెం మండలం కేసాపురం, పొలిమేరపల్లె, బోనమల గ్రామాల ప్రజలు, వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులుతో  నిర్వహించిన రచ్చబండ – కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలలో రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ లతో కలసి  వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆరోగ్యాన్ని హక్కుగా భావించి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న దృష్టితో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు పేదల భవిష్యత్తుకు మార్గదర్శకం అయ్యాయన్నారు. ఇప్పుడు ఆ కళాశాలలను ప్రైవేట్ వర్గాలకు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ యత్నం పేదల వైద్య హక్కుపై దాడి” అని మండిపడ్డారు.ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ప్రజల సొత్తు అని ఆయన అన్నారు. వాటిని అమ్ముకోవడం పాపమన్నారు. ప్రజలే ఈ దురాలోచనను అడ్డుకోవాలని ఆయన  పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa