వైయస్ఆర్సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి గ్రామ, మండల, అసెంబ్లీ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజేష్ తలే, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సూచన, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు తెలిపారు.గురువారం వంగర మండల కేంద్రంలో ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు,సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైయస్ఆర్సీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో వంగర మండల పరిధిలో ప్రతీ గ్రామ పంచాయతీలో కొత్తగా కమిటీలను నవంబర్ 16వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఒక అధ్యక్షుడు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు కార్యదర్శులు, ఆరుగుగు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉంటారని చెప్పారు. అనుబంధ సంఘాలకు సంబంధించి యువజన, మహిళ, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సోషల్ విభాగాలను కూడా పూర్తి చేయాలన్నారు. సోషల్ మీడియాకు సంబంధించి గ్రామానికి ఒకరిద్దరిని ఎంపిక చేయాలని సూచించారు. వ్యక్తిగత స్వార్థం, రాజకీయాల కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారిని కమిటీల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.కమిటీలు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మోసాలు చేసే వాళ్లు కాకుండా పార్టీకి కమిట్మెంట్తో పనిచేసే వాళ్లను నియమించాలన్నారు. గ్రామ, మండల పరిధిలో ఉన్న వైయస్ఆర్సీపీ నాయకులను సమన్వయం చేసుకుని వెళ్లాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తాను ఎలా అయితే సమావేశం నిర్వహించి సూచనలు చేశానో అదే తరహాలో గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టుకుని కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. గ్రామ, డివిజన్ స్థాయిల్లో సైన్యంలా పని చేసే కమిటీలు ఉండాలని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa