ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపడుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 12:52 PM

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమై పలువురు ప్రయాణికులు మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం అన్ని రకాల సహయక చర్యలను చేపట్టిందని వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించామని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa