AP: పేదలకు మంత్రి కొలుసు పార్థసారథి శుభవార్త చెప్పారు. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారికి 2-3 సెంట్ల స్థలం ఇవ్వడానికి కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. గత ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పినా.. ఎవరికి అందాయో తెలియడం లేదన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపైనా చర్చ జరిగిందని మంత్రి కొలుసు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa