భారతీయ ప్రకటనల రంగంలో తనదైన ముద్ర వేసిన వాణిజ్య ప్రకటనల దిగ్గజం పీయూష్ పాండే కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ ఆయన శుక్రవారం రోజు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన ఒక ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేరుగా ప్రముఖ ప్రకటనల సంస్థ ఓగిల్వీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే పీయూష్ పాండే అంత్యక్రియలను శనివారం రోజు నిర్వహించబోతున్నట్లు కూడా స్పష్టం చేసింది.
సుమారు నాలుగు దశాబ్దాల పాటు ప్రకటనల పరిశ్రమకు సేవ చేసిన పీయూష్ పాండే.. ఓగిల్వీ యాడ్ కంపెనీలో చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వంటి కీలక పదవులను నిర్వహించారు. 1982లో ఓగిల్వీ సంస్థలో అడుగు పెట్టిన ఆయన.. అనేక ప్రటలను రూపొందించారు. ప్రాశ్చాత్య ప్రకటనలు ఎక్కువగా ఉన్న మయంలోనే ఆయన భారతీయ సంస్కృతి, హాస్యం, భాషలకు పెద్ద పీట వేస్తూ ఆయన రూపొందించిన ప్రకటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దాదాపుగా ఆయన రూపొందించిన యాడ్స్ అన్నీ భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా ఫెవికాల్, క్యాడ్బరీ , ఏషియన్ పెయింట్స్, లూనా మోపెడ్, ఫార్చూన్ ఆయిల్తో సహా అనేక ప్రఖ్యాత బ్రాండ్లకు ఆయన యాడ్స్ను తయారు చేశారు.
పాండే నాయకత్వంలో ఓగిల్వీ ఇండియా యాడ్ ఏజెన్సీ వరుసగా 12 ఏళ్ల పాటు భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ ఘనత ఆయన సృజనాత్మకతకు, నాయకత్వ పటిమకు నిదర్శనం కాగా.. వీటిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీని ఇచ్చింది. ముఖ్యంగా ప్రకటనల రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా.. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ను దేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.కేవలం యాడ్స్ మాత్రమే తయారు చేయకుండా పలు సినిమా పాటలకు సాహిత్యాన్ని కూడా అందించారు. అంతేకాకుండా 2013లో విడుదలైన 'మద్రాస్ కేఫ్' చిత్రంలో కూడా ఆయన నటించారు. భోపాల్ ఎక్స్ప్రెస్ అనే సినిమాకు స్క్రీన్ప్లేలో సహకారం అందించారు.
తన అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పీయూష్ పాండే.. తాజాగా మృతి చెందడంతో దేశ ప్రజలంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా, రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అదానీలు కూడా.. భారతీయ అడ్వర్టైజింగ్ రంగంలో ఆయనొక 'లెజెండ్' అని కొనియాడారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa