దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, గడువు వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET - టెట్) 2025 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దరఖాస్తు ప్రక్రియ నిన్నటి నుంచే అధికారికంగా ప్రారంభమైంది. ఉపాధ్యాయ వృత్తిని ఆశించే అర్హత గల అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీగా నవంబర్ 23, 2025ను ప్రభుత్వం ఖరారు చేసింది. అభ్యర్థులు గడువులోగా తమ అప్లికేషన్లను సమర్పించి, పరీక్షకు సన్నద్ధమవడానికి తగిన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించడమైనది.
మాక్ టెస్ట్, హాల్ టికెట్ల విడుదల
పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవడానికి మరియు పరీక్ష వాతావరణాన్ని అనుభవించడానికి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25న ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. ఇది అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే, పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష తేదీ, సమయ వివరాలు
ఏపీ టెట్ 2025 పరీక్షను డిసెంబర్ 10న నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరీక్షను ఒకే రోజు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన సెషన్ మరియు సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది.
కీ మరియు ఫలితాల విడుదల తేదీలు
పరీక్ష పూర్తయిన తర్వాత, టెట్ కీ విడుదల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. జనవరి 2న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ఈ కీపై అభ్యంతరాలుంటే తెలియజేయడానికి కొంత సమయం ఉంటుంది. అనంతరం, తుది (ఫైనల్) కీని జనవరి 13న విడుదల చేస్తారు. ఇక, ఏపీ టెట్ 2025 పరీక్ష ఫలితాలను జనవరి 19న అధికారికంగా ప్రకటించనున్నారు. అభ్యర్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకొని, పరీక్షకు సంబంధించిన అన్ని అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించడమైనది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa