ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'క్లౌడ్ కిచెన్' పేరుతో సరికొత్త పథకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 03:02 PM

రాజధాని అమరావతి గ్రామాల్లోని మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'క్లౌడ్ కిచెన్' పేరుతో సరికొత్త పథకాన్ని అమలు చేస్తూ, మహిళలు తమ ఇళ్ల నుంచే ఉపాధి పొందేందుకు మార్గం సుగమం చేస్తోంది. ఈ పథకం ద్వారా అమరావతి నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు, అధికారులు, ఉద్యోగులకు నాణ్యమైన ఇంటి భోజనాన్ని కేవలం రూ.99కే అందిస్తున్నారు. ఈ పథకం కింద, రాజధానిలోని ప్రతి గ్రామం నుంచి సుమారు 35 మంది మహిళలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 26 రోజుల పాటు వంటల తయారీలో మెళకువలు, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు, వ్యాపార నిర్వహణ వంటి అంశాలపై నిపుణులతో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారు భోజనం తయారీ ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నారు.ఇటీవల లింగాయపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు మహిళల బృందం శిక్షణ పూర్తి చేసుకుని, తమ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించింది. వీరు నూతనంగా ప్రారంభమైన సీఆర్డీఏ కార్యాలయంలోని ఉద్యోగులకు భోజనం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 100కి పైగా ఆర్డర్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa