మొంథా తుపాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్న నేపథ్యంలో రైతులను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. తుపాన్ కారణంగా రైతులెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. తీవ్ర ప్రకృతి విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను ముందస్తు ప్రణాళికతో.. పకడ్బందీ ఏర్పాట్లతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా విజయవంతంగా అధిగమించగలిగామని గుర్తుచేశారు. ఈసారి కూడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. నష్ట నివారణ చర్యలను చాల పకడ్బంధీగా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను, అధికారులను, క్రింది స్థాయి సిబ్బంది అంతా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల అంచనా, పంట నష్ట నివేదికలను ప్రాథమికంగా సేకరించామని చెప్పారు. తుపాను తీవ్రత వలన అధికంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ఆయా ముంపు ప్రాంతాలలో తీసుకోవలసిన ముందస్తు నష్ట నివారణ చర్యలను, జాగ్రత్తలను అధికారుల ద్వారా రైతులకు చేరవేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa