ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 01:52 PM

 'మొంథా' తుపాను నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను కూడా పకడ్బందీ ప్రణాళికతో అధిగమించగలిగామని ఆయన అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. తుపాను కారణంగా రైతులు నష్టపోతే.. పూర్తిగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa