ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాన్‌ నేపథ్యంలో ప్రతి వైసీపీ నేత రైతులకి అండగా నిలవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 12:22 PM

మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్లీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీశారు. తుపాన్‌ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడడాన్ని ప్రశంసించిన ఆయన, ఇప్పుడు పంట నష్టం అంచనాల్లో ఎక్కడా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్దేశించారు. పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా, గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆయన ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కణ్నుంచి రాయలసీమలో కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మొంథా తుపాన్‌ ప్రభావం చూపింది. 25 జిల్లాలు, 396 మండలాలు, 3320 గ్రామాల పరిధిలో తుపాన్‌ ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలబడాల్సి ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మొంథా తుపాన్‌ ప్రభావం చూపింది. దాంట్లో 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 1.9 లక్షల ఎకరాల ఉద్యాన పంటల మీద మొంథా తుపాన్‌ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలబడాల్సి ఉంది. అలా రైతులకు అండగా ఉండి పార్టీ నాయకులంతా పని చేయాలి అని దిశానిర్దేశం చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa