ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాలపై నేడు నేతలతో చర్చించనున్న సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 04:11 PM

ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈరోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగనున్న ఈ సమీక్షలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, పార్టీలో అంతర్గతంగా తలెత్తుతున్న వివాదాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయ లోపం, క్రమశిక్షణ ఉల్లంఘనల వంటి అంశాలను చక్కదిద్దడమే లక్ష్యంగా ఈ భేటీ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల కొందరు నేతలు క్రమశిక్షణ గీత దాటుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, వారితో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడనున్నారు. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో రాజుకున్న వివాదంతో పాటు, మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత పోరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ అంశాలకు వెంటనే పరిష్కారం కనుగొని, పార్టీ పటిష్ఠతకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa