సామాన్య పౌరులు, ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం చూపనున్న 7 కీలక ఆర్థికపరమైన అంశాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కొత్త మార్పులు 2025 నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. వాటిల్లో బ్యాంకింగ్, పీఎఫ్, క్రెడిట్ కార్డ్, పెన్షన్ వంటి విభాగాల్లో ఈ కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిజిటల్ భద్రత మెరుగుపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో తాజా ఛార్జీల సవరణలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి వచ్చిన 7 కొత్త మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్యాంక్ వెబ్సైట్ డొమైన్ పేరు మార్పు
సైబర్ భద్రత మెరుగుపరచేందుకు, ఫిషింగ్, స్పూఫింగ్ వంటి డిజిటల్ మోసాలు తగ్గించేందుకు అన్ని బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ అడ్రస్ ప్రత్యేకమైన ఇంటర్నెట్ డొమైన్ '.bank.in'కు మార్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.
ప్రభావం: ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు ఇప్పటికే తమ అధికారిక వెబ్సైట్ URL కొత్త డొమైన్లోకి మార్చాయి.
నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డుపై ఉన్న పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి డెమోగ్రాఫిక్ వివరాలను myAadhaar వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లోనే సులభంగా సవరించుకోవచ్చు.
ప్రభావం: గతంలో కొన్ని రకాల మార్పుల కోసం వ్యక్తిగతంగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సిన వచ్చేది. తాజా అప్డేట్తో ఆ అవసరం తొలగిపోయింది. ఇంట్లో నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, వేలి ముద్రల వంటి బయోమెట్రిక్స్ కోసం మాత్రం వెళ్లాల్సి ఉంటుంది.
3. బ్యాంక్ ఖాతాకు 4 నామినేషన్ల సౌకర్యం
2025 నవంబర్ 1 నుంచి డిపాజిట్ అకౌంట్లు, సేఫ్టీ లాకర్లు, సురక్షిత కస్టడీలో ఉంచిన వస్తువులకు సంబంధించి కొత్త నామినేషన్ నిబంధనలు అమలు లోకి వచ్చాయి.
ప్రభావం: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 'బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025'లోని నిబంధనలను ధ్రువీకరించింది. ఇకపై ఒకే ఖాతాకు లేదా లాకర్కు 4 వరకు నామినేషన్లు పెట్టేందుకు వీలు కల్పించింది.
4. ఎస్బీఐ కార్డ్ ఛార్జీల్లో మార్పు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్ తమ ఫీజుల నిర్మాణాన్ని, ఇతర ఛార్జీలు సవరించింది. ఈ కొత్త మార్పులు నవంబర్ 1, 2025 నుంచే అమలులోకి వచ్చాయి.
ప్రభావం: విద్యకు సంబంధించిన చెల్లింపులు, వాలెట్ లోడ్ల వంటి కొన్ని ప్రత్యేక ట్రాన్సాక్షన్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ముఖ్యంగా రూ.1,000 కంటే ఎక్కువ విలువైన ప్రతి వాలెట్ లోడ్ ట్రాన్సాక్షన్ పై 1 శాతం ఛార్జీలు కట్టాల్సి వస్తుంది.
5. పీఎన్బీ లాకర్ ఛార్జీలు తగ్గింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ లాకర్ కేటగిరీల్లోని అద్దె ఛార్జీలను తగ్గించింది.
ప్రభావం: బ్యాంకు వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఈ సవరించిన లాకర్ రేట్లు నవంబర్ 14 నుంచే అమల అమల్లోకి వస్తాయి. అన్ని ప్రాంతాల్లో లాకర్ పరిమాణాలను బట్టి అద్దె తగ్గించడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు.
6. లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్) సమర్పణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ నెలవారీ పింఛను నిరంతరాయంగా అందుకునేందుకు నవంబర్ 1 నుంచి నవంబర్ 30, 2025 తేదీలోపు తమ వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని (Life Certificate) తప్పనిసరిగా సమర్పించాలి.
ప్రభావం: 80 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్నవారికి మాత్రం అక్టోబర్ 1, 2025 నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు.
7. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గడువు పొడిగింపు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు మారేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువు నవంబర్ 30, 2025 వరకు పొడిగించారు.
ప్రభావం: ఎన్పీఎస్ పరిధిలోకి వచ్చే అర్హత గల ఉద్యోగులు, రిటైర్ అయినవారు, మరణించిన రిటైర్డ్ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఈ గడువు వర్తిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa