ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ చారిత్రక గెలుపు భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్య

national |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 06:17 AM

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో భారత క్రీడాకారిణుల ప్రదర్శన అత్యుత్తమ నైపుణ్యం, గొప్ప ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని ఆయన కొనియాడారు.ఈ చారిత్రక విజయంపై ప్రధాని స్పందిస్తూ టోర్నమెంట్ ఆద్యంతం మన జట్టు అసాధారణమైన టీమ్‌వర్క్, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారిణులకు నా అభినందనలు అని పేర్కొన్నారు. భారత మహిళల జట్టు కనబరిచిన స్ఫూర్తిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ గెలుపు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదని, దేశంలోని భవిష్యత్ ఛాంపియన్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. "ఈ చారిత్రక విజయం, క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి యువతను మరింత ప్రోత్సహిస్తుంది అని ఆయన అన్నారు. భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa