ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది.. ఎంపీ రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 02:19 PM

మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించి తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం పట్ల అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి. ఎం. రమేష్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన దేశ ప్రజలందరికీ గర్వకారణమని, టోర్నీ మొత్తం సమష్టిగా రాణించి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించారని, ఇది భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని తెలిపారు. మహిళా క్రికెటర్ల పట్టుదల, కృషి ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుంటున్నాయని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa