ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జనం ఆందోళనకు గురి చేస్తున్నారు.కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో దగ్ధమయ్యింది. చేవెళ్ల సమీపంలో ఈ రోజు ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, రాజస్థాన్లోనూ ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగినది.తదుపరి ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో జరిగింది. భారతి ట్రావెల్స్ బస్సు లింగపాలెం మండలం, జూబ్లీ నగర్ సమీపంలోని మలుపు తిప్పే సమయంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న పరిశీలనలో బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో పైకి ఎత్తి, రోడ్డు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒకరు మాత్రమే మృతి చెందినట్టు ధృవీకరించబడింది. అయితే గాయపడిన 10 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa