ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాల తరఫున వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం కొత్తగా స్టాండింగ్ కౌన్సిళ్లను నియమించింది. ఈ మేరకు పలువురు న్యాయవాదులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై ఆయా సంస్థలకు సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలను వీరు పర్యవేక్షించనున్నారు.నియమితులైన వారి వివరాల్లోకి వెళితే.. ఏపీ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది బసు నాంచారయ్య నాయుడును నియమించారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ తరఫున జి. సాయి నారాయణరావు, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) తరఫున ఎం. శివకుమార్ వాదనలు వినిపించనున్నారు.అలాగే, తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సిల్గా వల్లభనేని శాంతి శ్రీ నియమితులయ్యారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఏపీ గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ ఆశ్రమ పాఠశాలల సొసైటీలతో పాటు ఏపీ ఆశ్రమ పాఠశాలల సొసైటీకి కలిపి న్యాయవాది తర్లాడ వినోద్కుమార్ను స్టాండింగ్ కౌన్సిల్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa