ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం వరాల జల్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 04:41 PM

మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి, క్రికెటర్ శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో 1,000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేర‌కు ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది. అలాగే మంత్రి లోకేశ్ కూడా ఈ విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా ప్ర‌త్యేకంగా పోస్టు పెట్టారు. "శ్రీచరణి అచంచల అంకితభావం ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె అద్భుతమైన విజయాన్ని గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది" అంటూ మంత్రి లోకేశ్ పోస్ట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa