ఏపీ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మొంథా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారం పై స్పష్టమైన ప్రకటన చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా నష్టం వివరాలను సేకరించింది.మొత్తం రూ.5,245 కోట్ల మేర నష్టం నమోదయినట్లు గుర్తించగా, కేంద్ర సాయం కోసం నివేదిక కూడా పంపింది. అదే సమయంలో, పంట నష్టపోయిన రైతులకు ప్రతి హెక్టారుకు రూ.25,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.మొంథా తుఫాను సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేశిందని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇలాగే పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి ₹3,000 నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించింది.గత తెలుగుదేశం ప్రభుత్వంలో హెక్టారుకు ₹20,000 నష్టపరిహారం ఉండగా, వైసీపీ ప్రభుత్వం ₹17,000కి తగ్గించిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హెక్టారుకు ₹25,000 పరిహారం ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. అలాగే, గత వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వే కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.మరిన్ని విషయాల్లో, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు ముఖ్య సమస్య గోదావరి డెల్టా కాలువల నష్టం అని మంత్రి తెలిపారు. ఈ కాలువలు పూడుకుపోవడం వల్ల పంటలు పాడవుతున్నాయి. ప్రభుత్వం ఎంత ఖర్చైనా, ప్రాజెక్ట్ రూపంలో నీటిపారుదల వ్యవస్థను బాగుచేయాలని ఆలోచిస్తోంది. దీని కోసం సమగ్ర సర్వే చేయడానికి ₹12 కోట్లు నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.మాజీ వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అయిదు సంవత్సరాల పాటు పూర్తి చేయలేదని, మార్చ్ నెలలో అన్ని ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయనున్నారు అని మంత్రి స్పష్టం చేశారు. తుఫాను పంట నష్టపరిహారం అంచనాలను కేంద్రానికి పంపుతున్నాం, కేంద్ర సహకారంతో త్వరలో రైతులకు నష్టం పరిహారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa