ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరంలో మైనారిటీ వెల్ఫేర్ డేకు ఏర్పాట్లు పూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 04:09 PM

విజయనగరంలో సోమవారం  మైనారిటీ వెల్ఫేర్ డే, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. మౌలానా అబుల్ కలాం అజాద్‌ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు జరుగనున్నాయని ఆదివారం చెప్పారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులను సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa