ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌లో ఉదయం 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్‌

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 02:14 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ పండగ వాతావరణంలా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 11 గంటల వరకు రికార్డు స్థాయిలో 31.38% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కిషన్‌గంజ్ జిల్లాలో అత్యధికంగా 34.74% ఓటింగ్ నమోదు కాగా, మధుబనీ జిల్లాలో అత్యల్పంగా 28.66% నమోదైంది. గయా, జముఈ, పూర్ణియా, పశ్చిమ చంపారన్, నవాడా, సీతామర్హి జిల్లాల్లో కూడా గణనీయమైన ఓటింగ్ నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa