ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడిపత్రిలో వైసీపీ నేతపై దాడికి పాల్పడిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 03:42 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆర్‌సీ ఓబుల్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు, శరీరానికి తీవ్ర గాయాలవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.వివరాల్లోకి వెళితే, తాడిపత్రిలోని ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో ఓబుల్ రెడ్డిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను గమనించిన స్థానికులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని ఓబుల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అయితే, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa