ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష: సీపీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:26 PM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని సీపీఎం మండల కన్వీనర్ పి. పక్కిరి సాహెబ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం పగిడ్యాల మండలం, ప్రాతకోట గ్రామంలో రైతులతో సమావేశమై కరపత్రాలు విడుదల చేశారు. ఎకరాకు 30 నుంచి 50 వేల వరకు పెట్టుబడి పెట్టి, వర్షాలు, తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa