ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురం లో 19 ఆలయాల అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరు చేస్తానన్న పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 07:37 AM

పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేగవంతం చేసినట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని 19 ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్  నుంచి రూ.20 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ, దేవాదాయ శాఖ అధికారులతో నిన్న పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభ పీఠం వంటి ప్రఖ్యాత ఆలయాలున్న పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన ఆలయాలను గుర్తించామని, వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు అవసరమైన నిధులను దేవాదాయ శాఖ సమకూరుస్తుందని పవన్ వివరించారు. 19 ఆలయాల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని, మ్యాచింగ్ గ్రాంట్‌తో ఈ నిధులను కేటాయిస్తారని తెలిపారు. ఆలయాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa