ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ ఎన్నికలు మొదటి నుంచి న్యాయంగా జరగలేదన్న రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 06:30 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. బీహార్‌లో ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలు మొదటి నుంచి న్యాయంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే తమ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు.రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఫలితాలను సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జరుగుతున్న పోరాటమని ఆయన వ్యాఖ్యానించారు. మహాఘట్‌బంధన్‌పై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa