భారత న్యాయవ్యవస్థలో ఒక నూతన అధ్యాయానికి తెరలేవనుంది. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకానికి సంబంధించిన ప్రక్రియ అక్టోబర్ 30న పూర్తయింది. ఆయన ఈ పదవిలో 2027 ఫిబ్రవరి 9 వరకు, అంటే సుమారు 15 నెలల పాటు కొనసాగుతారు. తన కెరీర్లో అనేక చరిత్రాత్మక, సంచలనాత్మక తీర్పులలో భాగస్వామి అయిన జస్టిస్ సూర్యకాంత్ నియామకంపై న్యాయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తన న్యాయవాద వృత్తిని హిసార్ జిల్లా కోర్టులోనే ప్రారంభించి, ఆ తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర స్వేచ్ఛ, ఎన్నికల సంస్కరణలు, లింగ సమానత్వం వంటి అనేక కీలక కేసుల విచారణలో ఆయన తనదైన ముద్ర వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa