మటన్ తిల్లిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్నవారికి ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.ఇది శరీరంలోని పాత, దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలను తొలగించడానికి, వాటి స్థానంలో కొత్త ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, తెల్ల రక్త కణాల వృద్ధిని ప్రోత్సహించి, వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.కొన్ని అధ్యయనాల ప్రకారం, క్యాన్సర్, చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు, రక్త సంబంధ వ్యాధులు, అలాగే కొన్ని హెచ్ఐవి ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి మటన్ తిల్లి తినడం కొంత ఉపశమనం అందిస్తుంది. చిన్నపిల్లలలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి, వయసులో ఉన్న వారిలో రక్తాన్ని బలోపేతం చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, మటన్ తిల్లి వండడం చాలా కష్టం కాదు. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. కొన్ని సన్నని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే అవసరం. దీని కోసం మటన్ తిల్లి, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చినచెక్క, ఉప్పు, పసుపు, కారం, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నూనె, కొత్తిమీర కావాలి.ముందుగా, నీటిలో బిర్యానీ ఆకులు, రెండు లవంగాలు, ఒక దాల్చినచెక్క వేసి బాగా మరిగించాలి. శుభ్రం చేసి కట్ చేసిన మటన్ తిల్లిని ఈ మరిగిన నీటిలో కేవలం ఒక నిమిషం ఉడకనివ్వాలి. దీన్ని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు, తద్వారా తిల్లికి ఉన్న సహజ వాసన పూర్తిగా తొలగిపోతుంది. తరువాత, తిల్లిని నీటిలోంచి తీసి, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.తర్వాత, పాన్లో నూనె వేసి వేడి అయ్యాక, స్టవ్ను సిమ్ మీద ఉంచి, మసాలాలు కలిపిన తిల్లి ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఇలా చేయడం వల్ల నూనె చిందకుండా సురక్షితంగా వుంటుంది. తిల్లి ముక్కలలోని నీరు ఆవిరైపోయి, నూనె పైకి తేలే వరకు మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ వేయాలి. మటన్ లివర్ ఫ్రైలా, తిల్లి కూడా గోధుమరంగులో వుంటుంది. చివరగా, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒక నిమిషం ఉడకనివ్వడం ద్వారా, రుచికరమైన తిల్లి కర్రీ సిద్ధమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa