ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు సోమవారం పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదివి ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, ఒక గంట పాటు విద్యార్థులకు పాఠంచెప్పారు . మంత్రి అడిగిన ప్రశ్నలకు పిల్లలు సమాధానాలు చెప్పగా, వారి తెలివితేటలు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో చేరాలని ఆయన వారిని ప్రోత్సహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa