AP: మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై పోరుబాటను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించిన నేపథ్యంలో, జగన్ ఈ నెల 17న గవర్నర్ అబ్దుల్ నజీర్ను ముఖ్య నేతలతో కలిసి కలవనున్నారు. ప్రజాభిప్రాయం, సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయనున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో కొత్త కార్యాచరణను ఖరారు చేసి, జనవరి చివరి వారం నుంచి జగన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇకపై జగన్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే సమయం కేటాయించనున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa