ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధిలో రాష్ట్రము దేశానికే ఆదర్శంగా నిలవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 04:16 PM

ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి ప్రగతి పథంలో నడిపి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో ఆయన అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై లోతైన సమీక్ష నిర్వహించిన సీఎం, రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను అధికారుల ముందుంచారు. గడచిన రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈసారి 17.11 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, "వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధించిన త్రైమాసిక ఫలితాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థిలా ఎదురుచూస్తాను. అధికారులు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి" అని అన్నారు. మొత్తం 17 కీలక రంగాల్లో (వర్టికల్స్) సమాన ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుతుందని, పశుసంపద, తయారీ రంగం, మత్స్య పరిశ్రమ వంటి అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa