ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశానికే ఆదర్శం కడప ‘స్మార్ట్ కిచెన్’ ప్రాజెక్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 18, 2025, 03:08 PM

జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సీఎం చంద్ర‌బాబుకు వివరించారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో పాఠశాల విద్యార్థులకు వేడిగా, రుచిగా పౌష్టికాహారం అందించేందుకు ‘స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్’ ప్రాజెక్టు చేపట్టామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ప్రతి మండలానికి ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి, పాఠశాలలకు భోజనం అందిస్తున్నామని చెప్పారు. దీని కోసం సౌర విద్యుత్, బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రశంసించిన సీఎం, ఇది దేశానికే మోడల్‌గా నిలుస్తుందన్నారు. "స్మార్ట్ కిచెన్... స్మార్ట్ హెల్త్... స్మార్ట్ చిల్డ్రన్ అనేలా దీన్ని తీర్చిదిద్దాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు కడప స్మార్ట్ కిచెన్లను సందర్శించాలి" అని ఆదేశించారు. మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ఈ విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించగా ఆయన కూడా అభినందించారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa